ప్రధాన మంత్రి మోడీకి వినపడేలా మనకు జరిగిన అన్యాయాన్ని అర్ధమయ్యేలా చాటి చెబుదాం.

0
962

రాజాం ఠీవిని, రాజాం ఆడపడుచులు ఇదే శక్తి, ఇదే తెగువ, ఇదే ఉత్సాహం ఢిల్లీకి వినిపించేలా చాటి చెబుదాం.

రాజాంలో  జనసేనాని ప్రసంగం :

* మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఒక్క జనసేన మాత్రమే గళమెత్తి ప్రజల తరపున పోరాడుతుంది

* ముఖ్యమంత్రి గారు మాట్లాడితే 29 సార్లు ఢిల్లీ వెళ్ళా అంటారు, 36 సార్లు మాటలు మార్చారు

* దారిలో వస్తుంటే ధర్మ పోరాట దీక్ష గెలాక్సీ కనపడింది, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జనసైనికులకు 9 రోజులు జైలులో పెట్టింది తెదేపా ప్రభుత్వం

* అక్కడ ఫ్లెక్సీలో ఉన్న గజపతిరాజు గారికి ఓట్లు వేయించుకున్నపుడు పవన్ కళ్యాణ్ తెలుసు, ఇప్పుడు తప్పులు ఎత్తి చూపితే పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు.

*గజపతిరాజు గారు మాకు పెద్దలంటే గౌరవం ఉంది, కేంద్ర మంత్రిగా ఉండి, పక్కనే ఉంటూ ఉద్దానం సమస్యని పట్టించుకోకుండా రాజభోగాలు అనుభవిస్తాం అంటే చూస్తూ ఊరుకొము

* శ్రీకాకుళం జిల్లా బాగుపడాలంటే ఈ ప్రాంతం నుంచి ఒక జీఎంఆర్ ప్రపంచస్థాయిలో నిర్మాణ రంగంలో అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకెంతమాంది వస్తారు

* అభివృద్ధి అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదు రాజాం కూడా

* పగిడి గ్రామంలో మీ అవినీతిని ప్రశ్నించినందుకు మీ ప్రభుత్వానికి అండగా నిలబడిన 15 మంది జనసైనికులను 9 రోజులు జైలులో పెట్టారు

* మీరు ఇలానే ప్రజల్ని వంచిస్తూ పోతే త్వరలోనే తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here